
Chandravamsha ప్రజాపతి బ్రహ్మకు అత్రి మహర్షి కలిగాడు. ఆయనకు చంద్రుడు ఉదయించాడు. ఈయన తారామండలానికి రాజుగా, ఓపధులకు అధీశుడుగా ప్రఖ్యాతుడయాడు,
ఈయన రాజసూయం చేసి ముల్లోకాలూ గెలిచారు,ఈ చంద్రుడు దేవగురుని భార్య తారమ కామించాడు. ఆమె గర్భవతి అయి కుమారునికన్నది.
ఆ ముందరాకారుని చూచి బృహస్పతి తన కుమారునిగా స్వీకరిస్తా నవగా వివాదం రేగింది. బ్రహ్మవచ్చి విషయం గ్రహించి వానిని చంద్రుని పుత్రుడుగా సంపించాడు.
ఆ కుమారుడే బుధుడు.బుధునిభార్య ఇళ. వీరి కుమారుడు పురూరవుడు.
వీని రూపురేఖా విలాసాలు విని ఊర్వశి శాపగ్రస్తయై మానవజన్మయెత్తి భూలోకానికి వచ్చి ఆమహారాజును ఏకాంతంలో దర్శించింది.ఊర్వశీ సౌందర్యమోహితుడై పురూరవుడు ఆమెను చేరి తనకోరిక తెలిపాడు.ఊర్వశి నవ్వుతూ:
రాజేంద్రా! నాకు రెండు నియమాలున్నాయి. అవి నువ్వు పాటిస్తే నిన్ను వరిస్తాను. నియమం తప్పినక్షణంలో నిన్ను విడిచిపోతాను. నాకు రెండు గొర్రెలున్నాయి.. వానిని నిరంతరం మవ్వు రక్షిస్తూండాలి.
రెండవరి ఎన్నడూ వా “ముందు నువ్వు దిగంబరంగా కనపడకూడదు, అంది.మోహమత్తుడైన పురూరవుడు ఆమోదించి, ఆమెతో నిర్విరామ శృంగారయాత్ర సాగిస్తున్నాడు.
సాగుతూండగా అమరావతిలో దేవేంద్రుడు, తన సభలో యింతకాలంగా ఊర్వశి లేక పోవడం చోటుగా ఉన్నదని గందర్వులను పంపించాడు.
గంధర్వులు వచ్చి ఒకనాటి రాత్రి అత్యంత రహస్యంగా ఊర్వశి పెంచుకునే గొర్రెలను అపహరించబోగా అవి రోదనం చేశాయి, వాని అరుపు సాగుతున్నా పురూరవుడు గాడనిద్రలోనే వుండిపోయాడు.ఊర్వశి లేచి :
నా కన్నబిడ్డలవంటి పొట్టేళ్ళను దొంగలు అపహరిస్తున్నా మొద్దు విద్రపోయే నువ్వూ మగవాడివేనా! నోరులేని పశువులను రక్షించలేవు.
ప్రియురాలి కౌగిలితప్ప మరేమీ ఎరగని మగవాడై పుట్టడంకంటె ఆడ జన్మ మేలు, అని అనేకవిధాల నిందించగా, భరించలేక శయ్యదిగిన వాడు దిగినట్లేపోయి ఆ దొంగలను సంహరించి గొర్రెలు తోలుకు వచ్చాడు.
రాత్రి నిద్రమైకంలో శరీరంమీద వస్త్రం ఉన్నదీ, లేనిదీ చూసుకోకుండా పోయి వచ్చి దిగంబరంగా నిలబడగా, తక్షణం ఊర్వశి అంతర్థానం అయింది.
ప్రియురాలు కనిపించక దీనంగా విలపిస్తూ తిరిగి తిరిగి నరస్వతీ నదీ తీరాన చెలికత్తెలతో వున్న ఊర్వశిని చూసి, పరిపరివిధాల వేడగా ఆమె:
మహారాజా తియ్యతియ్యని మాటలతో వంచించడమే తప్ప, మన్మథునికూడా మనసారా ప్రేమించని వేశ్యలతో నీకెందుకయ్యా.సరే, ఒక్క సంవత్సరం ఆగి నా దగ్గరకురా.
అప్పుడు నీకు యోగ్యులయిన పుత్రులను అందిస్తాను, అనగా ఆమె గర్భవతి యని గ్రహించి పురూరవుడు తరలివెళ్ళాడు.సంవత్సరం గడిచాక ఊర్వశి దగ్గరకు పోగా ఆమె గంధర్వులను వేడుకో అంది.
వారు అగ్నిస్థాలి యిచ్చారు. అదే ఊర్వశిగా భావించి కొంతకాలం గడిపాక విషయం తెలిసి దానిని విడిచిపెట్టాడు.అయినా ఆయన మనస్సు ఆమె మీదనే ఉంది.అంతలో కృతయుగం గడిచి త్రేతాయుగం ప్రవేశించింది.
ఆయన మనస్సులో వేదధర్మం మూడు విధాలుగా గోచరించగా, జమ్మిచెట్టులో పుట్టిన రావిచెట్టు కొమ్మలు రెండు అరణులు చేశాడు. మొదటి అరణి తానుగా, రెండవది ఊర్వశిగా నడుమనున్న కర్ర కుమారుడుగా మధనం చేయగా జాతవేద రూపంతో అగ్ని సంభవించి ఆహవనీయాగ్నిగా ప్రఖ్యాత మయింది.
ఆ అగ్నితో పురూరవుడు శ్రీహరిని ఆరాధించాడు. అనంతరం గంధర్వలోకంలో ఊర్వశిని చేరి ఆయువు, ప్రతాయువు ఆదిగా ఆరుగురు కుమారులను కన్నాడు.ఆ వంశంలో కుంబుడికి గాధి పుట్టి రాజ్యం పాలిస్తున్నాడు.
గాధికూతురు సత్యవతిని ఋచికుడు భార్యగా అర్థించాడు.ఆరాజు: మృదువయిన దేహాలతో, నల్లనిచెవులతో అలరారే వెయ్యి గుర్రాలిస్తే పిల్ల విస్తాము. అనగా ఆయన వరుణునివేడి గుర్రాలు తెచ్చి పిల్లను పెళ్ళి చేసుకున్నాడు. కొంతకాలం జరిగింది.కార్య సత్యవతి,
ఆమె తల్లి తమకు పుత్రసంతానం కావాలని ఋకుని వేడగా ఆయన క్రతువు సాగించి, విప్రమంత్రపూతంగా ఒక హవిస్సు, రాజమంత్రాలతో ఒక పాసిస్సు సిద్ధంచేసి నదీస్నానానికి వెళ్ళాడు.ఆసమయాన సత్యవతి విప్రమంత్రపూతమయిన దొన్నె తల్లి వచ్చి, రెండవది తాను ఆరగించింది.
స్నానంచేసి వచ్చిన ఋచికుడు విషయం గ్రహించి)అమాయకురాలా! మీరిద్దరూ చేసిన తెలివితక్కువవల్ల మీ అమ్మకు బ్రహ్మవేత్త పడతాడు. నీ గర్భాన వరస క్రూరుడు పుడతాడు, అనగా దీనంగా ప్రార్థించింది.Chandravamsha
ఆయన కరుణించి కొడుకు సాదువుగా ఉంది, మనుమడు క్రూరుడుపుతాడు, అని పంపించాడు.
సత్యవతికి కలిగిన కుమారుడే జమదగ్ని ఆమనధార్య రేణుక, వీరక పురు పోత్తమాంశతో పెరకరాముడు పుట్టాడు.